క్షేత్రస్థాయిలో పరిమితమైన ఎస్ వి బాబు రాజకీయ జోరు పెంచారు

పెడన: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ హరి రామ జోగయ్యని మర్యాదపూర్వకంగా కలిసి పెడన నియోజవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను చర్చించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఇప్పటివరకు ఎటువంటి బాధ్యత నాకు ఇవ్వకపోయినా జనసేన పార్టీపై ఉన్నటువంటి అభిమానంతో పని చేశాను పెడన నియోజకవర్గంలో జనసేన సీటు నాకు ఇవ్వాలని మీలాంటి పెద్ద వారి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య స్పందిస్తూ ఎస్వి బాబు గారి పూర్తి వివరాలను ఆర్థిక స్థితిగతులను కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని ఎస్ వి బాబు గారి అభ్యర్థత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అధినాయకుడిని కలిసి మీ విన్నపాన్ని తెలియజేయాలని సూచించారు.