పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, చింతపల్లి పంచాయతీలో జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి చనిపోయిన ముత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న మత్స్యకార గ్రామలు చాలా దుర్భర పరిస్థితితుల్లో ఈరోజు ఉన్నాయి అని, ఈ పరిస్థితులకి కారణం ప్రభుత్వాల వైఫల్యమే అని ఎన్నికలకి ముందు ముత్స్యకార ఓట్ల కోసం జపం చేసి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గత కొన్నాళ్ళుగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ముత్స్యకార గ్రామాల ప్రజలు వారి కుటుంబాలని విడిచిపెట్టి వారి జీవనాదికోసం ఎంతో దూరం వలసలు వెళ్ళవల్సిన పరిస్థితి కనిపిస్తుందని, అదే ఈరోజు చింతపల్లి పంచాయతీలో ఇద్దరు మత్స్యకారుల చావుకి కారణమైందని వారిలో ఒకరు గుజరాత్ మరొకరు కర్ణాటకలో ప్రాణాలు విడిచిపెట్టడం ఎంతో విచారకరంగా ఉందని తెలిపారు. ఇన్ని వలసలు కొనసాగుతున్న ఎంతో మంది ప్రాణాలు విడిచి పెడుతున్న ప్రభుత్వం వారి గోడుని పెడచెవిన పెడుతుందని, ఉత్తరాంధ్ర నుండి ఎంతో మంది ఎన్నో ఎల్లుగా కాబినెట్ లో మంత్రులుగా ఉన్న, ముత్స్యకార కుటుంబాల పరిస్థితిల్లో ఏ మార్పు రాలేదు అని ఇది అందరు ఆలోచించాలి అని మాధవి ప్రజలని కోరారు. వలసలని అరికట్టాలి అంటే ఈ ప్రాంతంలో జట్టినిర్మాణం మరియు ఫిషింగ్ హార్బర్ర్ నిర్మనించి ఉపాధి అవకాశాలు కల్పించాలని అప్పుడే ఈ వలసలని అరికట్టవచ్చు అని తెలిపారు. సముద్రంలో వివిధ పరిశ్రమల నుండి వస్తున్న రాసాయనాలని నేరుగా సముద్రంలోకి వదలడం ద్వారా ముత్స్యసంపద దెబ్బ తింటోంది అని దాని వలన తమకు జీవనోపాధి కరువైందని ముత్స్యకారులు వాపోయారు. ఈ ప్రభుత్వాలు మత్స్యకారులని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనసేన పార్టీ ఒక్కటే వారి పట్ల, వారి హక్కుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర నుండి మత్స్యకార మంత్రిగా ఉన్న సిదిరి అప్పలరాజు వారి సమస్యలపై స్పందించకపోవటం, జట్టినిర్మాణం పైన ఉత్తరాంధ్ర ప్రజలకి హామీ ఇవ్వకపోవడం ఎంతో సిగ్గుచేటని తెలిపారు. చనిపోయిన ముత్స్యకారుల కుటుంబానికి ఆర్ధికసహాయం అందజేసి వారికి అండగా ఉంటామని లోకం మాధవి భరోసా కల్పించారు. అదే పంచాయతీలో ఇల్లు దగ్ధం అయిన కుటుంబాన్ని మాధవి లోకం పరామర్శించి, వారి కుటుంబానికి ఆర్ధికసహాయం చేసి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాధవి మాట్లాడుతూ పూరిగుడిసెలు దగ్ధం అవ్వడం నియోజకవర్గంలో సాధారణంగా మారిపోయిందని వారిని కనీసం పలకరించటానికి, వారి ఆస్థి నష్టం తెలుసుకోవటానికి ఏ ప్రభుత్వ అధికారి ఇప్పటివరకు వీరి దగ్గరకి వచ్చిన దాఖలాలు లేవని, వారికి ప్రభుత్వం వారు పక్కా ఇల్లు ఇప్పటివరకు నిర్మించకపోవడం చాలా బాధకరమని, ఇల్లు కట్టుకునే వారు బిల్లుల పెట్టుకుంటే వారికి మంజూరు చేయట్లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.