మాడుగుల జనసేన వనభోజనాల కార్యక్రమం

మాడుగుల: దేవరపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు రాయపురెడ్డి కృష్ణ వారి మామిడి తోటలో నాలుగు మండలాల జనసైనికులకు పిక్నిక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా నుంచి రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ ప్రసాద్, జనసేన లీగల్ సెల్ చైర్మన్ శ్రీమతి కరణం కళావతి, సోషల్ మీడియా విభాగం భాస్కర్ కొండేటి ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. వారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను, ప్రజల్లో జనసేనకు పెరుగుతున్న గ్రాఫ్ ను జనసైనికులకు వివరించడం జరిగింది. తదనంతరం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలవడానికి ప్రతి పంచాయతీల్లో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళమని దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి జనసైనికులు సుమారు 400 మంది పాల్గొన్నారు.