రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న “మహాపాదయాత్ర”

  • రాబోవు రోజుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే.
  • సమ సమాజ స్థాపనకు ప్రతీ జనసైనికుడు వారధిగా నిలవాలి.
  • ప్రజల కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం, అవిశ్రాంతంగా పోరాడుతాం.
  • నియోజవర్గంలో రికార్డ్ స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు.
  • ‘బత్తుల’ నాయకత్వంపై అన్ని వర్గాల్లో పెరుగుతున్న నమ్మకం, అభిమానం.
  • ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమానికి విశేష స్పందన.

రాజానగరం “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం రాజానగరం మండలం, సంపత్ నగరం గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నాయకత్వంలో, వీరమహిళల నేతృత్వంలో ఉదృతంగా కొనసాగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ, ఆడపడుచులకు బొట్టు పెడుతూ ఈసారి జనసేన పార్టీకి ఓటు వేసి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి, రాష్ట్రాన్ని ఈ రాక్షస అరాచక పాలన నుండి రక్షించాలని అభ్యర్థిస్తున్న తరుణంగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ముక్తకంఠంతో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం ఈసారి మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకే అవకాశం ఇచ్చి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తామని ముందుకు రావడం శుభసూచకం. అనేక చోట్ల మహిళలు హారతులు పడుతూ, తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రజల విశేష ఆదరణతో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ వ్యవస్థల శ్రేయస్సు కోరి ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని, నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తమకు తెలియపరచాలని, తమ వంతు సాయం తాము చేస్తామని, పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వాలు కార్యకర్తల కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని, ముందుచూపుతో ఆలోచించి ఈ సభ్యత్వ నమోదు ప్రవేశపెట్టడం జరిగిందని, నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కావడం చాలా సంతోషంగా ఉందని, ఇదే ఉత్సాహంతో, ఇదే స్పీడ్ తో కార్యకర్తలు, జనసైనికులు రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేసి, సమాజ స్థాపనకు వారదులుగా నిలవాలని, ఆడపడుచులు బొట్టు పెట్టే కార్యక్రమానికి ఎంత పెద్దఎత్తున ఆదరణ లభించడం సంతోషంగా ఉందని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ “మహాపాదయాత్ర” కార్యక్రమంలో సంపత నగరం జనశ్రేణులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.