జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: గొల్లపల్లి అనురాధ

రాయవరం, జనసేన పార్టీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరఒ లోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజకీయాలో తీసుకురావాల్సిన మార్పు కోసం,పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తును యువతకు అందించడం కోసం,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. జగన్మోహన్ రెడ్డి అసమర్థ, అవినీతి పాలనపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చే పిలుపు కోసం జనసైనికులు, వీరమహిళలు, పవన్ అభిమానులు, ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.