గుర్రంపాలెంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పెందుర్తి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం పెందుర్తి మండలం, గుర్రంపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉరిటి లక్కీ గోవింద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్రంపాలెం గ్రామ జనసేన పార్టీ నాయకులు మహేష్ పైడిరాజు గణేష్ దేవి ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.