జనసేన భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

  • జాంబవని పేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులను కలిసిన జనసేన నేతలు

ముమ్మిడివరం నియోజకవర్గం: పల్లవారిపాలెం, జాంబవని పేట గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ మరియు కొత్తపేట ఇన్చార్జి బండారు శ్రీను ఎమ్మార్పీఎస్ నాయకులను కలిసి జూన్ 21వ తేదీన వారి యొక్క సమస్యలు వివరించి, పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగోలు పండు, బండారు వెంకన్న బాబు, గొల్ల కోటి వెంకన్న బాబు, సత్తాల సంపత్ రావు, సత్తాల ఏసుబాబు, కొల్లి రామస్వామి, బొమ్మి సత్యనారాయణ, సత్తాల పవన్ కళ్యాణ్, సత్తాల దిలీప్, సత్తాల ప్రసన్నకుమార్, బొమ్మి నాగార్జున, సత్తాల సత్యనారాయణ, సప్తల సిద్దు, జక్కంపూడి కిరణ్, చింతలపూడి వెంకటేశ్వరరావు, కాకిలేటి కృష్ణ, వల్లభ రెడ్డి, సతీష్, ఏవీఎస్ఎన్ మూర్తి, పి శ్రీనివాస్, సిహెచ్ ప్రశాంత్, పి శివాజీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.