జనసేన భరోసా యాత్రను జయప్రదం చేయండి: గోపాలకృష్ణ

తెలంగాణా లో.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికులు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ క్రమంలో మరణించిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలను పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా రాజేంద్రనగర్ నియోజిక వర్గ జనసేన నాయకులు గోపాలకృష్ణ తెలియజేసారు.