జనసేన 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – రెడ్డి అప్పల నాయుడు పిలుపు

మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేసే ప్రణాళికలో భాగంగా నూజివీడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల కమిటీ సభ్యులతో శనివారం నూజివీడులో సమావేశమైన నియోజకవర్గ సమన్వయకర్తలు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు, మరీదు శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ ఆవిర్భావ సభలో జనసైనికులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సంక్షేమం కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.. అనంతరం ముఖ్య నాయకులతో కలిసి ఆవిర్భావ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు..