పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవనన్న ప్రజాబాటతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మీ సేవకుడినై వస్తున్నాను, ఆశీర్వదించండి. ఏడాది పాటు సాగే పవనన్న ప్రజాబాట నెల్లూరు 3వ డివిజన్, మైపాడు రోడ్డు, ప్రశాంతి నగర్, డీజీపీ కళ్యాణ మండపం దగ్గర.. మే 19న (గురువారం) ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.