యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: జనసేన రాము

నంది కొట్కూరు: జూపాడు బంగ్లా మండలం, 80 బన్నూరు గ్రామంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలం వేదికగా జనవరి 12న యువత సమస్యలపై గళం వినిపించేందుకు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోయే యువశక్తి కార్యక్రమానికి కర్నూలు జిల్లా జనసైనికులు, వీరమహిళలు, జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని జనసైనికులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన రాము మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం జగన్ సర్కార్ ప్రజలను పూర్తిగా విస్మరించింది, ముఖ్యంగా యువకులు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ బదులుగా అప్పుల క్యాలెండర్ ఇచ్చాడు జగనన్న, పరిశ్రమలు పెట్టుబడులు కంపెనీలు లేవు శిలాపలకాలు, శంకుస్థాపనలకే పరిమితమైందని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, సంక్షేమం లేదు అని, ఇది చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వమని జనసేన రాము అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డే నవీన్, రామ్ రెడ్డి, ప్రవీణ్, తరుణ్, సురేష్, శేషు, జనసేన రాము తదితరులు పాల్గొన్నారు.