కిడ్నీ బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో ఉన్న అయ్యవారి పేట(టిడిఆర్ రాజు పేట) గ్రామములో గల కిడ్నీ బాధితులను పరామర్శించిన ఆమదాలవలస నియోజకవర్గ జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కొల్ల జయరాం, ఎంపీటీసీ విక్రమ్, కోరుకొండ మల్లేశ్వర రావు, సేపేన రమేష్, గేదెల వాసు, దూబ సంగం నాయుడు, మామిడి సత్యన్నారాయణ, మౌళి, తిరుపతి, నరేష్, టాంకాల రమేశ్, మజ్జి ధనుంజయ, గేదెల సన్యాసి నాయుడు మరియు కార్యకర్తలు, అభిమానులు. ప్రతీ కిడ్నీ బాధితుడిని కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, వారికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాటిచ్చారు. ఇది మరొక ఉద్దానంగా మారకుండా ఉండడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని, వైద్యనిపుణులను తీసుకువచ్చి సంబంధిత పరీక్షలు నిర్వహించి మెడిసిన్, మెడికల్ సేవలను అందిస్తామని. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు.