ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికుడు గెడ్డం రాజు బైక్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. ఆ కుటుంబాన్ని పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పరామర్శించి మనోధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, గడ్డం నాని, గోపిశెట్టి నాగేశ్వరరావు, పి.వి.ఎస్.ఎన్ మూర్తి, రమేష్, కోదండ, వెంకటరమణ, గడ్డం కృష్ణ, ఎన్. వీరబాబు, బుజ్జి, జి.శ్రీనివాసరావు, జి.సత్యనారాయణ, వీరబాబు, విజయ్, సురేష్, గడ్డం వీరబాబు, రాజు,రాజ్ కుమార్, సత్తిబాబు, పెద్దకాపు, రాజేష్, రామన్నపాలెం జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.