సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఉత్సవాల్లో మాకినీడి ప్రత్యేక పూజలు

పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ప్రఖ్యాత ఆలయాల్లో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రజల శ్రేయస్సు కొరకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గొల్లప్రోలు మండలం తటిపర్తి గ్రామంలో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని దుర్గడ, ఎకె. మల్లవరం, మధవపురం గ్రామాల్లో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో పూజలు చేసి, జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమల్లో పాల్గొని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరధి వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, కరణం రాజేంద్ర, దాసం కొండబాబు, గారపాటి శివకొందరావు, వార్డు మెంబర్లు గొల్లపల్లి గంగ, వెలుగుల సతీష్, వెలుగుల లక్ష్మణ్, గొల్లపల్లి దొరబాబు, కరణం రాజేంద్ర, బండి చిన్నస్వామి, గంట రమణ, గొల్లపల్లి శ్రీనివాస్, పెనుగొండ సోమేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, బండి బుజ్జి, శాఖ సురేష్, గొల్లపల్లి లోవరాజు, దాసం కొండబాబు, సుంకర సోమన్న దోర, తలపర్థి చంద్రరావు, తలపర్తి వీరబాబు, తళావతి చక్రరావు, వసు, చిన్న, సాయి, గంగాధర్, నూకరాజు, సురేష్, మేళం బాబి, యాండ్రపు శ్రీనివాస్, దేశిరెడ్డి సతీష్, పబ్బినీడి ప్రసాద్, కసిరెడ్డి నాగేశ్వరరావు, నామా శ్రీకాంత్, నామా సాయిబాబు, జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.