గుబ్బల హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలో ఇటీవల మరణించిన గుబ్బల హరికృష్ణ (28) వారి కుటుంబాన్ని శనివారం జనసైనికులు నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లి ఈశ్వరరావు, మేడిశెట్టి స్వామి, కుప్పల గణపతి, చింతపల్లి విష్ణు, కొప్పి శెట్టి నాగేశ్వరరావు, పిల్లి వెంకటేష్, గుబ్బల లోవరాజు, గుబ్బల సూర్యనారాయణ రావు, గుబ్బల గణేష్, గోపు సురేష్, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శిలు మొగలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.