చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం

సత్యవేడు నియోజకవర్గం: వరదయ్యపాలెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు. చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ మండలంలో క్షేత్రస్థాయిలో పార్టీ ని బలోపేతం చేయాలనీ, ప్రతీ పంచాయతీలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరగాలి. అలాగే ప్రతీ గ్రామంలో బూత్ స్థాయి కమిటీ, పంచాయతీ కమిటీ మండల అనుబంధ కమిటీలు వేసి ప్రజల్లోకి వెళ్లాలని తెలియజేసారు. ఎన్నికలకి సమయం తక్కువగా ఉన్నదని, ప్రతి జనసైనికుడు కష్టపడి పనిచేయాలని, జనసైనికులకి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శిలు శేఖర్, తులసి, కేశవ, శ్రీధర్, నవీన్, వెంకటేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.