సాల్మన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అప్పనరాములంక కొత్తలంక గ్రామంలో నల్లి సాల్మన్ అకాల మరణం చెందినారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు సాల్మన్ పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. వారి వెంట దొమ్మేటి సత్యనారాయణ, నల్లి రామారావు, నల్లి కిరణ్, బేబీ తదితరులు ఉన్నారు.