కే. కోటపాడు మండలంలో జనసేన పార్టీలో భారీ చేరికలు
కే. కోటపాడు మండలం, చౌడువాడ గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ఆధ్వర్యంలో చౌడువాడ గ్రామంలో బాలి బోయిన సంతోష్, బాలి బోయిన లక్ష్మి, పాతర పల్లి అప్పారావు, దుక్క గంగరాజు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన 30 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి బిసెట్టీ వసంతలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, పెందుర్తి నియోజకవర్గం వీర మహిళ పిన్నింటి పార్వతి, మాడుగుల నియోజకవర్గం వీర మహిళ సురేఖ, మాడుగుల నియోజకవర్గం ముఖ్యనాయకులు గుమ్మడి శ్రీరామ్, రేవతి, కె. కోటపాడు మండలం కోట్యాడ గోవింద్ పాలవెల్లి, కుంచా అంజి, ఉగ్గిన త్రినాధ్, మజ్జి ఈశ్వరరావు, కడుపుట్ల రామునాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసారు.