జనసేన సభ్యత్వం నమోదు చేసుకోండి: గొల్లపల్లి అనురాధ

పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచే సత్తా ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, చెల్లూరు ఎంపీటీసీ-1 గొల్లపల్లి అనురాధ అన్నారు. ఈ నెల 7వ తారీఖుతో పార్టీ సభ్యత్వాల నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె స్వగృహంనందు మీడియా తో మాట్లాడుతూ.. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే 5 లక్షల రూపాయల ప్రమాద భీమా.. అదే విధంగా ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడి వైద్యశాలలో చేరితే వైద్య ఖర్చుల నిమిత్తం 50,000/-రూపాయల వరకూ ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఇప్పటికే పలువురు జన సైనికులకు పలు ఆర్ధిక సహాయలు అందించడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నుండి 70 ఏళ్ళ లోపు వయస్సు వారంతా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9849208813 +91 99631 01055, నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని అనురాధ కోరారు.