జనగామ జిల్లా కేంద్రంలో బేజాడి శ్రీ చరణ్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు..

జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బేజాడి బీరప్ప కుమారుడు మాస్టర్ శ్రీ చరణ్ జన్మదిన శుభ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దావఖానాలోని నిరుపేద 80 మంది రోగులకు మరియు గిర్నిగడ్డలోని శ్రీ రాజరాజేశ్వరి సేవాసదనంలో
పాలు, పండ్లు ,బ్రెడ్, జ్యూస్(ఓఋశ్) ప్యాకెట్లను, పవన్ కళ్యాణ్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంద చేయడం జరిగింది. ఈ సందర్భంగా జోగు భాస్కర్ మాట్లాడుతూ.. జనగామ జిల్లా యువ నాయకులు బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బీరప్పన్న ఆలోచన విధానాల మేరకు, ఈ సమాజం నాకేమిచ్చిందని కాదు ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడతాను అనే విధానం తోటి, అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం బేజాడి కుటుంబం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పీపుల్స్ హెల్పింగ్ అధ్యక్షులు జోగు భాస్కర్, దయ ఉపేందర్, సాయిరాం, రంజిత్, దిలీప్, జోగు ఉదయ్, అశోక్ పృథ్వి, మను, అజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు..