పరిడిగ్రామంలో జనసేనలో చేరికలు

అరకు నియోజకవర్గం, డుంబ్రిగుడ మండలం, అరమ పంచాయితీ పరిది లోగల పరిడిగ్రామంలో సుమారు ౩౦ మంది గ్రామస్తులు స్వచ్చందంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి, జనసేననాయకులు కొన్నేడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బంగరు రాందాస్ మాట్లాడుతూ యువత నిరుత్సాహంతో ఉన్నారని సరైన ఉపాధి పథకాలు లేక యువత జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొన్నేడి చిన్నారావు, బంగారు రాందాస్, చెట్టి ఆనంద్, కిల్లో రాజ్ భరత్, సోబోయి రాజు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, ఐటి సెల్ కో-ఆర్డినేటర్ సంతోష్ సింగ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.