బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో పెద్దఎత్తున చేరికలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మునగాల గ్రామంలో వైఎస్సార్సిపికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ పాలన పట్ల విసుగుచెంది, స్థానిక నాయకులు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వం, వారి సేవా గుణానికి ఆకర్షితులై వైసీపీ కి చెందిన సుమారు 40 మంది నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో మునగాల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.