జనం మారాల్సిన సమయం ఆసన్నమైంది, ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి: బత్తుల

  • మునగాల గ్రామంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు ఉధృతంగా కొనసాగిన మహాపాదయాత్ర
  • మహిళలు, గ్రామపెద్దల ఆదరణతో మహాపాదయాత్రకు విశేష స్పందన
  • జనంకోసం జనసేన – మహా పాదయాత్ర 51వ రోజు

రాజానగరం, కోరుకొండ మండలం, మునగాల గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జనంకోసం జనసేన – మహా పాదయాత్రలో భాగంగా జరిగిన కార్యక్రమంలో గ్రామస్తుల నుండి అనూహ్యస్పందన, ఆదరణ లభించింది. జనసైనికుల సహకారంతో మహాపాదయాత్ర గ్రామంలో విజయవంతంగా ముగిసింది. రాత్రి 10 గంటల వరకు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ఈసారి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితిపరుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని, ప్రజాపరిపాలన తీసుకువచ్చి మీ బిడ్డల భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ జనసేన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కూడా మునగాల గ్రామంలో కొన్ని వీధుల్లో రాత్రిపూట మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎంపిటిసి అభ్యర్థి మండపాక శ్రీను, భూపాలపట్నం సర్పంచ్గు ల్లింకల లోవరాజు, కేత వీరబాబు, కాళ్ళ శ్రీను, జుతుక రామస్వామి, పళ్ల పరిశుద్దరావు, బాసు వీరబాబు, తోట సీతారామ స్వామి, కొల్లి యేసు, కోళ్ళ పుల్లారావు, తోట సూరిబాబు, నున్నబాయిన గంగాధర్, నక్కాసుబ్బారావు, నగులపల్లి దుర్గారావు, నరాల త్రిమూర్తులు, నాగ గంగాధర్, బాసు మణికంఠ, మండపాక విష్ణు, మూర్తి, మండపాక మునీంద్ర, వాసంశెట్టి శ్రీను తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.