కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన బొర్రా యూత్

సత్తెనపల్లి పట్టణంలో విద్యా కేంద్రం క్రీడా ప్రాంగణంలో నిర్వహించినటువంటి నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో ముప్పాళ్ళ మండలమునకు చెందిన బొర్రా యూత్ టీమ్ వారు నియోజకవర్గ స్థాయిలో మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుని కలిసి పోటీల్లో పాల్గొనేందుకు తమకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులని బొర్రా వెంకట అప్పారావు శాలువాలతో సత్కరించి ముందు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని అందుకు తన వంతు సహకారం అందిస్తానని వారికి తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి పట్టణ ఏడో వార్డ్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నా.