గుంటూరు జనసేనలో భారీ చేరికలు

గుంటూరు నగరంలోని స్థానిక 25వ వార్డు డివిజన్ నుండి నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మరియు 25వ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరియు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడానికి పెద్ద సంఖ్యలో యువకులు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన్వారిని వారికి సాదరంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అలహరి, నగర ఉపాధ్యక్షులు చింతా రాజు, నగర ప్రధాన కార్యదర్శి యడ్ల నాగమల్లేశ్వరరావు, నగర కార్యదర్శులు మిరియాల వెంకట్, బండారు రవీంద్ర, షేక్ బాషా, కొత్తకోట ప్రసాద్, పార్టీ విధేయులు పమిడి పవన్, జనసైనికులు పాల్గొన్నారు.