జనసేన పార్టీలో భారీ చేరికలు

పీలేరు: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధనకార్యదర్శి కే నాగబాబు మరియు చిత్తూరు జిల్లా అధయక్షుడి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గం ఎర్ర వారి పల్లి మండలం కమల పంచాయతీ చెందిన వైసిపి పార్టీ నుండి 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కల్లప రవి మరియు ఎర్రవారిపల్లి మండల అధ్యక్షుడు మరియు చిన్నగొట్టిన మండల అధ్యక్షుడు మురళి నాని సమీక్షంలో కమల పంచాయతీ పంచాయతీలోని వైసిపి నాయకులు జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి గెలుపు కోసం మా వంతు మేము కృషి చేస్తామని అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి మేము వైసిపి నుండి జనసేన చేరుతున్నామని చెప్పడం జరిగింది. పార్టీలో చేరిన వారు లోకేష్ మరియు ప్రభు సుబ్రహ్మణ్యం, సాయి, చంద్రబాబు, ప్రసాద్, రాము, రాకేష్, తేజ, విశ్వనాథం, కుమార్, శివ శంకర, మదన తదితరులు పార్టీలో చేరడం జరిగింది.