జనసేన బలోపేతంలో నాదెండ్లది కీలకపాత్ర: నేరేళ్ళ సురేష్

గుంటూరు, జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం అవ్వటంలో జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ది కీలకపాత్ర అని గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. గురువారం నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలోనూ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరవుతోటలోనూ కేక్ కట్ చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరి ఆలయంలోనూ, రెడ్డిపాలెంలోని మానవతా సేవ సమితి ఆశ్రమంలో అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ శాసనసభ్యుడిగా తెనాలి అభివృద్ధిపై నాదెండ్ల చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా సభను నడిపిన తీరుని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోరని పేర్కొన్నారు. జనసేన పార్టీలో చేరిన క్షణం నుంచి నాదెండ్ల మనోహర్ పార్టీ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ కు కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావటంలోనూ వారిని సమన్వయ పరచటంలోనూ మనోహర్ పాత్ర అభినందనీయమని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రాజకీయ ధురందరుడుగా, అపర చాణుక్యుడిగా వినుతికెక్కిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి చేస్తున్న సేవలు నిరుపమానమన్నారు. నాడు రావణాసురుడి బందీ నుంచి సీతమ్మను కాపాడటంలో శ్రీరాముడుకి అంజనేయుడు తోడుగా ఉన్నట్లు నేడు 151 తలలతో విర్రవీగుతున్న జగణాసురుడి బారి నుండి ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేసేందుకు పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కి బాసటగా నాదెండ్ల నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 16 డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, 47 డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్నయ్య, నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, నగర ప్రధాన కార్యదర్శి చామర్తి ఆనంద్ సాగర్, మరియు నగర్ కార్యదర్శులు, నగర సంయుక్త కార్యదర్శిలు, డివిజన్ అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.