జనసేన పార్టీలో భారీ చేరికలు

రంపచోడవరం నియోజకవర్గం: రంపచోడవరం మండలం, రంప పంచాయతీ దొర వీధిలో మండల అధ్యక్షుడు పిఆర్పి శ్రీను ఆధ్వర్యంలో 35 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన టిడిపి ఉమ్మడి కార్యక్రమాలు సమన్వయకర్త కుర్ల రాజశేఖర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైసిపి ప్రభుత్వం వల్ల గిరిజనులు విద్యకి దూరమవుతున్నారని ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం అయ్యారని రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొనతం శ్రీనివాస్, ఆకుల జయరాం, కొమరం పండు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.