బేంక్ పేట ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ముత్తా శశిధర్ ఆలోచనలతో ఆదివారం 34వ డివిజన్ బేంక్ పేట ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ ప్రాతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం వర్గాలు ఎంతో ఆశలు పెట్టుకుని ఈ వై.సి.పి పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి కృషి చేసాయనీ, కానీ ఈ ముఖ్యమంత్రి అధికారం చేజిక్కించుకున్నాకా చేసిన వాగ్దానాల సంగతి మరిచిపోయాడన్నారు. ముస్లింల సంక్షేమం ఊసే లేదనీ, వారిని పైకి తెచ్చే ప్రయత్నమే లేదని అసహనాన్ని వ్యక్తం చేసారు. ముస్లింలు తమ సొంత సంపాదనతో హజ్ యాత్ర చేసే స్థాయి కోరుకుంటున్నారనీ అంతే కానీ ఎంతకాలమైనా ఇలాగే పరాన్నజీవులుగా ఉండాలని కోరుకోడంలేదన్నారు. ముస్లింలకు మెరుగైన సంపాదన పొందే ఆదాయ మార్గాలను కల్పించడంలో ఈ వై.సి.పి ప్రభుత్వం విఫలమైందనీ, దూరాలోచన లేని గుడ్డి పాలనని నేడు చూస్తున్నామని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి మొయినుద్దీన్, రోషన్, అబీబుల్లా, షాబుద్దీన్, రఫీ, సంధిన్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.