బొంతు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

  • జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో అంతర్వేది, పల్లవపాలెం అగ్నికుల క్షత్రియ సోదరీ, సోదరీమణులు 100 మంది భారీ చేరిక

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం అంతర్వేది, పల్లవ పాలెం గ్రామం నుండి అగ్నికుల క్షత్రియ సోదరీ, సోదరీమణులు 100మంది జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లింగి దుర్గాప్రసాద్, చింత స్వామి, ప్రసాద్, బన్నీ,అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు. సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్ సభ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరావు మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరుతున్న సోదరీ సోదరీమణులందరికీ అభినందనలు తెలిపారు. అగ్నికుల క్షత్రియులందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.