జనసైనికులే అసలైన ప్రజా నాయకులు: ముకుంద నాయుడు

తెలంగాణ, వనపర్తి నియోజకవరర్గం, పెబ్బైర్ మండల పరిధిలోని బునాదిపురం గ్రామములోని జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందించామని వనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు కార్యకర్తలను తయారుచేసుకొని మోస్తుంటే మొదటి సారిగా కార్యకర్తలు తమ పార్టీని ఒక జనసైన్యంగా, సైనికులుగా మారి పార్టీని బలంగా తయారుచేసుకుంటూ తమ అధినేతకు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి స్వంత సంపాదన పెట్టుబడిగా పెడుతూ మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనం కోసం రాబోయే భవిష్యత్ తరాల అభివృద్ధి కొరకు నేటి జీవితాన్ని నూతన వ్యవస్థ కొరకై పాటుబడుతున్నారు అని పేర్కొన్నారు. విప్లవాత్మక మార్పులకై ముందడుగు వేస్తున్న జనసైనికుల సంక్షేమం కొరకు పార్టీ ఎల్లప్పడూ మొదటి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ భరోసా కల్పిస్తుందని తెలిపారు. అందరూ జన సైనికులు ప్రజా హితవు కోరుతూ ముందడుగు వేయాల్సిన సమయమని అవినీతి, స్వార్థమే రాజ్యంగా మారుతున్న వ్యవస్థను మార్చుకోకపోతే భవిష్యత్ కాలం అంధకారమే అని యువకులు ఈ విషయంలో భాధ్యత తీసుకొని నవ సమాజ నిర్మాణానికి సమయం కేటాయించాలని సమాజం అంతా ఒకే కుటుంబంగా తలిచి బాగుచేసుకోవలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెబ్బైర్ మండల నాయకులు విజయ్, కురుమూర్తి బునాదిపురం గ్రామ ముఖ్య నాయకులు ఎల్లస్వామి, నరసింహ, రాముడు, యశ్వంత్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.