మండపేటలో భారీ అగ్నిప్రమాదం- కోట్లలో ఆస్తినష్టం

తూర్పు గోదావరి జిల్లా మండపేట లోఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏడిద బైపాస్ రోడ్ లో వైకాపా నేతలు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ళ మాధవి బాబు,వేగుళ్ళ చైతన్య బాబు లకు చెందిన మాధవి ఎడిబుల్ ఆయిల్స్ లిమిటెడ్ లో షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ప్లాంట్ కు ఎగబకాయి. తక్షణమే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు.దీంతో మండపేట, అనపర్తి నుంచి నాలుగు అగ్నిమాపక వాహనాలు ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే పరిశ్రమ లోని చాలా భాగాలు పూర్తిగా కాలి బూడిదగా మారాయి. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న వెంటనే యజమానులు పట్టాభి, మాధవి బాబు లు అక్కడికి చేరుకున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు లు అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.