కాకినాడ రూరల్ జనసేనలో భారీ చేరికలు

కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన నాయకులు దుగ్గన బాబ్జి, నల్లం శ్రీరాములు, మరియు కొవ్వాడ జనసేన నాయకులు ఆధ్వర్యంలో కొవ్వాడ నాయకులు కోటిపల్లి శ్రీను సూచనలు, సహకారంతో కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్, పబ్బినీడి కృపరావు, తాతపూడి శాంతి శేఖర్, వేమగిరి రవి కిరణ్, సలాది కన్నా నాయకత్వంలో వైసీపీకి రాజీనామా చేసి కొవ్వాడ నుండీ భారీ బైక్ ర్యాలీతో వందలాదిగా బయలు దేరి కాకినాడ రూరల్ వలస పాకల గంగరాజు నగర్ రోడ్డు నెంబర్ 1 లో గల జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన -టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికీ జనసేన పార్టీ కండువా వేసి జనసేన కుటుంబంలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.