వైఎస్ఆర్సిపి నుండి జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

పలమనేరు నియోజకవర్గం, వి.కోట మండలం, జిల్లా కార్యదర్శి మరియు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పూల చైతన్య మోహన్ మరియు మండల అధ్యక్షుడు ఏ.వి బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చిత్తూరు జనసేన పార్టీ ఆఫీస్ నందు డీకే చైతన్య ఆదికేశవులు సమక్షంలో వి.కోట మండలం చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కె రెడ్డి భాస్కర్ (పొట్టు భాస్కర్) మరియు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కుప్పు స్వామి నాయుడు, వీర మహిళలు ఉష, సుశీలమ్మ, డి.రాజేంద్ర, మహేష్, రామ్మూర్తి, వినాయక, విజయ్, వినోద్, జునోజ్, మరియు నియోజకవర్గంలో తదితర కార్యకర్తలు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కష్టపడి పార్టీని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.