జనసేనాని త్వరగా కోలుకోవాలని తిరుమలకు పాదయాత్ర చేపట్టిన మస్తాన్ రాయల్

నందలూరు: ఇటీవల జనసేన అధ్యక్షులు ప్రజనాయకుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కి గురైన విషయం తెలిసిందే. జనసేనాని త్వరగా కోలుకోవాలని.. అలాగే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలని నందలూరు జనసైనికుడు మస్తాన్ రాయల్ శనివారం ఉదయం 7 గంటలకు ఉమ్మడి కడప జిల్లా పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థలం తాళ్ళపాక లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మస్తాన్ రాయల్ ప్రయత్నం విజయవంతం కావాలని.. ఆయన కొరుకుంటున్న కొరికలన్నీ నెరవెరాలని మనస్సు పూర్తిగా టీం నందలూరు జనసేన తరపున శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గురివిగారి వాసు, భాను తేజ, గోపి, పోలి నారష్, పోలిశెట్టి శ్రీనివాసులు, జావాజి రవి, వీరయ్య ఆచారి, నరహరి, గోవర్థన్ ఆచారి, మల్లెల, హరీష్, ఉపేంద్ర, శంకరయ్య, మారుతీ, సుబ్బు మందపల్లి యువత టీం నందలూరు జనసేన సైనికులు పాల్గొన్నారు