పదవి విరమణ పొందిన ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ ను సత్కరించిన పంతం నానాజి

కాకినాడ రూరల్, కాకినాడ వాస్తవ్యులు జే.వి ప్రసాద్ ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ గా ఇటీవల పదవి విరమణ పొంది నేడు కాకినాడ విచ్చేసిన సందర్బంగా భానుగుడి సెంటర్ లో ఆయనకు కాకినాడ రూరల్ జనసేన నాయకులతో కలిసి దుస్సాలువ మరియు పూలమాలవేసి ఘనస్వాగతం పలికిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ సందర్బంగా నానాజీ మాట్లాడుతూ ప్రసాద్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని దేశసేవ చేయాలనే కృతనిశ్చయంతో భారత సైన్యంలో చేరి ఎన్నో ఉన్నత పదవులు పొంది, పదవి విరమణ పొంది శనివారం కాకినాడ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, సైన్యంలో ఉండి కాకినాడకి ఎప్పుడు వచ్చినా స్నేహితులని కలవకుండా వెళ్లేవారు కాదని తెలిపారు.