టీమ్ పిడికిలి పోస్టర్లు ఆవిష్కరించిన మత్స పుండరీకం

పాలకొండ నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రలో జనసేన ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి పోస్టర్లు పార్వతీపురం మన్యం జిల్లా టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ బుధవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం ఆవిష్కరించారు. మీ మీ నియోజక వర్గం మండలాలు, వివిధ గ్రామాల్లో కి వెళ్లి ఆటోలకి, జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అతికిఒచాలని మత్స పుండరీకం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టీమ్ పిడికిలి మండల కోఆర్డినేటర్లు కర్ణేన సాయి పవన్, నందివాడ పండు, ఉదయాన చరణ్, కంటు రాంబాబు, కె ప్రసాద్, జి లోకేష్, మజ్జి శరత్ తదితరులు పాల్గొన్నారు.