నా సేన కోసం… నా వంతు లో భాగంగా పామిడి జనసేన

గుంతకల్, పార్టీకి ఎంత ఇచ్చామో అన్నదానికంటే ఎంతమందిని భాగస్వాములుగా చేర్చాము అన్నదే ముఖ్యం. ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రయత్నం చేద్దాం పనిచేద్దాం. ప్రజాసేవ కోసం పెట్టినటువంటి పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు సేవలు నచ్చి ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎంతమంది ఆ పార్టీలో తమ వంతు భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు అన్నదే ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఆశయాలను అందరికీ వివరించి పవన్ కళ్యాణ్ పార్టీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం కోసం అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు మన సేన కోసం మన వంతు కార్యక్రమంలో భాగంగా నేడు జనసేన పార్టీ నాయకులు అలాగే అభిమానులు తమ వంతు బాధ్యతగా పార్టీకి విరాళాలు అందించడం జరిగినది. అలాగే ప్రతి ఒక్క అభిమాని దగ్గరకు సామాన్య ప్రజల దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాణ్ భావజాలాన్ని వివరించి ఎందుకు జనసేన పార్టీలో తమ వంతు భాగస్వామ్యం అవ్వాలో వారికి వివరించి జనసేన పార్టీకి తమ వంతు విరాళాలను అందించే విధంగా కార్యక్రమాన్ని నేడు పామిడి మండలంలో మొదలు పెట్టాము. పార్టీకి నిస్వార్థమైన సైనికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ముందుకు తీసుకువెళ్తాం అని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యం ధనంజయ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, ధను, ఖాజావలి, అబ్దుల్ రొషన్ జమీర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.