ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ ఆత్మకు శాంతి చేకూరాలి

పిరమిడ్ ధ్యాన ప్రక్రియ గురువు సుభాష్ పత్రిజీ శివైక్యమ్ చెందటం ధ్యాన అభ్యాసకులను ఎంతో వేదనకు లోను చేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ధ్యానం విలువను, అవసరాన్ని అందరికీ చేర్చడంలో గురువుగా ఆయన తన వంతు బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించారని ఒక ప్రకటనలో తెలిపారు. నేను చిత్ర పరిశ్రమలోకి రాక ముందు సుభాష్ పత్రిజీతో ధ్యానం, సంబంధిత అంశాలపై సంభాషించి, కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. శివైక్యమ్ చెందిన పత్రిజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన శిష్య బృందానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు.