పలు కుటుంబాలను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, బుచ్చంపేట గ్రామానికి చెందిన జనసేనపార్టీ నాయకులు అల్లం బాపిరాజు తండ్రి అల్లం వెంకటేశ్వర్లు గత కొన్ని రోజులు క్రితం బైక్ స్కిడ్ అవ్వడంతో హ్యాండ్ సర్జరీ చేయించుకున్నారనే మాట తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, కోరుకొండ మండల కన్వీనర్ మండపాక శ్రీను, రాజానగరం మండలం బత్తిన వెంకన్నదొర, తెలగంశెట్టి శివ, అడబాల హరి, చల్లా ప్రసాద్ పాల్గొన్నారు.

  • బొల్దిపాటి శ్రీను కుటుంబానికి రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ ‘కోటి’ గ్రామానికి చెందిన బొల్దిపాటి శ్రీను ప్రమాదవశాత్తు మరణించారని, ఆ మరణ వార్త తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పి, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 5,000₹ రూపాయలు ఆర్థిక సహాయం చేసి, భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చదువు నాగేంద్ర, తన్నీరు శ్రీను, తన్నీరు పోసిబాబు, రాయపాటి శివ, గణశాల సురేష్, గణశాల వీరబాబు, గట్టి సూర్యారావు, చదువు లక్ష్మినారాయణ, నల్లగొండ జనసేన పార్టీ నాయకులు శ్రీను, శ్రీరంగపట్నం జనసేన పార్టీ నాయకులు అడపా అంజి, తన్నీరు తాతాజీ, కోలా జాన్ ప్రసాద్ తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.