మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వీరమహిళ వినతి

భీమవరం, వీరవాసరం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో భాగంగా మండలంలో ఉన్న అధికారులతో సమీక్షా సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారాలతో మాట్లాడాము. అందులో ముఖ్యంగా ఆర్ అండ్ బి వారితో రోడ్ల దుస్థితి గురించి మంచి నీరు, డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా మండల పరిషత్తు నిధులు కోటి 50 లక్షలు ఉండగా వాటితో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకుండా శాసనసభ్యులైన గ్రంధి శ్రీనివాస్ ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదు. బుధవారం మీటింగ్ లో కూడా ప్రస్తుత ఇంచార్జ్ ఎంపీడీవో మేము అదే విషయాన్ని అడగగా ఆయన కూడా మాకు సహకరించడం లేదని ఈ నిధులు విషయంగా ఇప్పటివరకు ముగ్గురు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ఇన్చార్జి ఎండిఓ పరిస్థితి కూడా అదే ఇది ఇలానే ఉంటే మా మండలంలో అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి స్థానిక శాసనసభ్యులు వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.