అవినీతిని ప్రశ్నిస్తే దాడులా..??: రెడ్డి అప్పలనాయుడు

  • వేలేరుపాడు జనసేన కార్యాలయంపై వైసీపీ గుండాల దాడిని ఖండించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: అవినీతిని ప్రశ్నిస్తే పోలవరం నియోజకవర్గం వేలేరుపాడులోని జనసేన పార్టీ మండల కార్యాలయంపై వైసీపీ గుండాల దాడికి ఎగబడ్డారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. వేలేరుపాడులోని జనసేన పార్టీ మండల కార్యాలయంపైన, మండల అధ్యక్షులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్ మరియు మరో 8 మంది జనసైనికుల మీద మంగళవారం రాత్రి సుమారు 60 మంది వైసీపీ గుండాలు దాడి చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది అన్నారు. జనసేన నాయకులు వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీస్ యంత్రాంగం విచారణ చేసి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దాడి విషయాన్నీ వదిలేది లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని, రౌడీ రాజకీయం చెయ్యొద్దని హెచ్చరించారు. పులులు సింహాలు అని చెప్పుకోవడం. కాదని, పోలవరం ప్రాజెక్ట్ చేసి చూపించాలని, అంతే గాని అవినీతిని ప్రశ్నిస్తే దాడికి దిగుతారా? అని ప్రశ్నించారు. మీ జగన్ కడప రౌడీ రాజకీయాలు ఇక్కడ చెయ్యాలని చూస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.