పలు కుటుంబాలను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

  • సోడసాని గంగారావుకు రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ముక్కినడా గ్రామానికి చెందిన సోడసాని గంగారావు గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో రాజమహేంద్రవరం వాసవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించి 10000₹ రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి ముక్కినడా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కవ్వల శ్రీరామ్, పెద్దకాపు, చల్లా ప్రసాద్ పాల్గొన్నారు.

  • ప్రమాద ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు భరోసా

కోరుకొండ మండలం, ఇటీవల శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కళాకారులు బృందం ప్రమాద ఘటనలో చనిపోయిన బిశెట్టి వీరబాబు, సూరిశెట్టి దుర్గా, ఆడారి బుల్లయ్య కుటుంబాలకు అండగా ఒక్కొక్క కుటుంబానికి 10,000₹ రూపాయల చొప్పున 30,000₹రూపాయలు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆర్థిక సహాయంతో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ ల చేతుల మీదుగా అందజేసిన విషయం విధితమే. సోమవారం చనిపోయిన వారి కుటుంబాలను రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల వైస్ ప్రెసిడెంట్ కాత సత్యనారాయణ, దుబాయ్ శ్రీను, భద్రం, తన్నీరు తాతాజీ అడపా అంజిబాబు తనకాల అజయ్ కుమార్, కర్రీ శ్రీను, గొల్లకోటి రమేష్, గొల్లకోటి రవి, ముత్యాల రత్నాజీ, అడపా శీను, గ్రామ పెద్దలు మాజీ వైస్ ప్రెసిడెంట్ పీలా జగన్నాథం, అప్పారావు, కోటి గ్రామం ముక్తేశ్వరరావు చదువు నాగు పాల్గొన్నారు.

  • వెంకయ్యమ్మకు రూపాయలు 5000/- ఆర్ధికసాయం

సీతానగరం మండలం, కూనవరం గ్రామ హరిజన పేటకు చెందిన కొల్లి నరసయ్య మరణ వార్త విన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి భార్య కొల్లి వెంకయ్యమ్మకి రూపాయలు 5,000₹ నగదు ఇచ్చి జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.