విజయదశమి మహా అన్నసంతర్పణలో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండల పరిధిలో ఉన్న కొండగుంటూరు గ్రామంలో విజయదశమి సందర్బంగా మహా అన్నసంతర్పణ గ్రామస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి రాజానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర హాజరయ్యారు. ఆలయ కమిటీ వారికీ జనసేన పార్టీ తరుపున రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ 5,000₹ రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి బాబు, పోరాడి సాధించు ఉద్యమ సంస్థ అధ్యక్షులు పంటగట్ల మాణికుమార్, పేమ్మన బోయిన నాగేశ్వరరావు(అబ్బులు), సుంకర సత్యనారాయణ, పేమ్మనబోయిన సుబ్బారావు, సింగంశెట్టి సత్యనారాయణ, మట్ట సత్యనారాయణ, బోటేపల్లి రాంబాబు, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, కామిరెడ్డి పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.