శెట్టి నారాయణరావును పరామర్శించిన మేడా గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, చక్రద్వారబంధం గ్రామానికి చెందిన శెట్టి నారాయణరావు తల్లి శెట్టి సత్తమ్మ అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్. వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని రూపాయలు 5000 నగదు తన వంతు భరోసాగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, వైస్ ప్రెసిడెంట్ నాగవరపు భానుశంకర్, యూత్ ప్రసిడెంట్ సుంకర బాబ్జి, గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఆనందల గోవిందు, యూత్ ప్రెసిడెంట్ కడిమి దుర్గా రావు గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.