వైయస్సార్సీపీ నుండి జనసేన పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

రాజానగరం నియోజవర్గం, సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామం నుండి బిసి మరియు ఎస్సి సామాజిక వర్గాలకు చెందిన కార్యకర్తలు 58 మంది, వైయస్సార్సీపీ పార్టీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు మరియు జనసేన పార్టీ విధివిధానాలు నచ్చి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి రామకృష్ణ జనసేన కండువా కప్పి మర్యాదపూర్వకంగా పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ… వీరి చేరికతో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో మరింత ఉత్సాహం నెలకొంటుంది అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు.