సీతానగరం సీఐకి పిర్యాదు చేసిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండల పరిధిలో ఉన్న కూనవరం గ్రామంలో విజయదశమి సందర్బంగా జనసైనికులు వెయ్యించిన ఫ్లెక్సీని కొంతమంది గుర్తుతెలియని కొంతమంది దుండగులు ఆదినాయకుడిని బ్లేడుతో కొయ్యడం జరిగింది. గతంలో కూడా కూనవరం గ్రామంలో జనసేన ఫ్లెక్సీలు చింపేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి వెంటనే కూనవరం గ్రామం వెళ్ళి, సంఘటన స్థలంలో సీతానగరం సీఐ ఉమామహేశ్వరరావుకి కూనవరం జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి పిర్యాదు చెయ్యడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరల ఇంకోసారి జరిగితే మాత్రం జనసేన పార్టీ ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు తీసుకురాకండని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూనవరం జనసేన పార్టీ ముఖ్య నాయకులు గేదల సత్తిబాబు ఆధర్వంలో చిక్కాల నాగశ్రీను, మదిరెడ్డి అయ్యప్ప, సంగీశెట్టి సామీ కాపు, ఉమ్మిడిశెట్టి సురేష్, మాధవరుపు నాని, కాళ్ళ రాము భారీ ఎత్తున్న జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.