ఆడారి శ్రీనును పరామర్శించిన మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామనికి చెందిన ఆడారి శ్రీను పొలం పనులు చేస్తుండగా పొడ పాము కాటుకు గురయ్యారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ తరుపున వారిని కలిసి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, మండపాక మురళి, చల్లా ప్రసాద్, శ్రీరంగపట్నం జనసేన పార్టీ కమిటీ ప్రెసిడెంట్ గంగాధర్, తన్నీరు తాతాజీ, కొనాల రాజు, ముత్యాల రత్నజీ,పులసల స్వామి, అడపా కృష్ణ, కొనాల కోటి బాబు, గొల్లకోటి వెంకటేశ్వరావు, జాజుల శంకరయ్య, లైటింగ్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.