మీడియాకు స్వేచ్ఛ ఉండాలి: తులసి ప్రసాద్

పూతలపట్టు: జనసేన పార్టీ చిత్తూరు జిల్లా వైయస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న మీడియా వ్యక్తులపై వైసిపి గూండాలు దాడులకు పాల్పడడం అప్రజాస్వామికం. ఈ దాడిని జనసేన పార్టీ పూతలపట్టు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసి ప్రసాద్ అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మీడియా సిబ్బందిని గాయపరిచి, వాహనాలను మరియు కెమెరాలను ధ్వంసం చేయడం చూస్తుంటే వారి బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత బాబాయిని హత్య చేసి రాజకీయ పలుకుబడి ద్వారా ఏదైనా చేయొచ్చు అనే ధీమాతో ఇలా ప్రవర్తించడం తప్పు. అలానే ఇతర విషయాల్లో కూడా రోజురోజుకీ అధికారి పార్టీ ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రభుత్వానికి ఓటు ద్వారా సమాధానం చెప్తారని, మీడియా వ్యక్తులపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని నరిగన్నగారి తులసి ప్రసాద్ కోరారు.