కూకట్పల్లి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం
తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి.హెచ్.బిలో శనివారం హోటల్ ఏటిసిలో జనసేన పార్టీ స్టేట్ ఐ.టి కో-ఆర్డినేటర్ పెన్నమరెడ్డి నాగబాబు అధ్యక్షతన కూకట్పల్లి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కూకట్పల్లి నియోజకవర్గ క్రియాశీల సభ్యులు పాల్గొని తెలంగాణ ఎన్నికలలో కూకట్పల్లి నియోజకవర్గంలో బిజేపి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ను గెలిపించడానికి గల కార్యాచరణలో భాగంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది. గాజు గ్లాసు గుర్తును ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళే పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-11-at-16.46.16-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-11-at-16.46.15-1024x768.jpeg)